- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, బూర్గంపాడు: రాష్ట్రంలో మావోయిస్టుల ప్రభావం లేకుండా ఉండే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని సారపాకలో గల ఐటీసీ గెస్ట్ హౌజ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీజీపీ మాట్లాడారు. తొలుత అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పలు అంశాలపై డీజీపీ చర్చించారు.
అనంతరం డీజీపీ మాట్లాడుతూ.. ములుగు,భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ఎస్పీలు, సీనియర్ అధికారులతో ప్రభావిత ప్రాంతాలను పరిశీలించినన్లు పేర్కొన్నారు. రెండు జిల్లాల పోలీస్ అధికారుల పనితీరు పట్ల ప్రశంసలు కురిపించారు. మావోయిస్టు సమస్యను ఎదుర్కొటానికి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్, ములుగు జిల్లా ఎస్సీ సంగ్రామ్ సింగ్ పాటిల్ ఆధ్వర్యంలో తగినటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.