జీవో నెం.1పై AP DGP ఆసక్తికర వ్యాఖ్యలు

by Disha Web Desk 16 |
జీవో నెం.1పై AP DGP ఆసక్తికర వ్యాఖ్యలు
X
  • ఎవరినీ అడ్డుకోవడం లేదు..బెదిరించడం లేదు
  • పాదయాత్రకు జిల్లా హెడ్ క్వార్టర్స్‌లో అనుమతి తీసుకుంటే చాలు

దిశ, డైనమిక్ బ్యూరో: జీవో నెంబర్ 1పై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. జీవోను బేస్ చేసుకుని ఎవరినీ అడ్డుకోవడం లేదని, ఎక్కడా బెదిరింపులకు పాల్పడటం లేదని వివరణ ఇచ్చారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పోలీసుల జిల్లా రివ్యూ మీటింగ్‌కు హాజరైన డీజీపీ జీవో నెంబర్ 1పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

జీవో వచ్చిన తరువాత కూడా పొలిటికల్ పార్టీలు, మీటింగులకు అనుమతులు ఇచ్చినట్లు డీజీపీ గుర్తు చేశారు. ఎవరైనా పాదయాత్ర చేయాలంటే జిల్లా హెడ్ క్వార్టర్స్‌లో అనుమతి తీసుకుంటే సరిపోతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో గంజాయి ఇరవై ఐదు ఏళ్ళ నుండి నడుస్తుందోన్నారు. గతేడాది నుంచి గంజాయి నాశనం చేస్తున్నామని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న గంజాయి సాగును అక్కడ వాళ్ళు ధ్వంసం చేయాలని డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి సూచించారు.

Next Story