ఆంక్షలు సడల్లేదు.. అనుమతి తీసుకోవాల్సిందే: డీజీపీ

by  |
ఆంక్షలు సడల్లేదు.. అనుమతి తీసుకోవాల్సిందే: డీజీపీ
X

దిశ, ఏపీ బ్యూరో: దేశంలో ఏమూల నుంచి ఏమూలకైనా వెళ్లవచ్చని, ప్రయాణ ఆంక్షలు సడలించామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారిని అనుమతించే విషయంలో ఆంక్షలు కొనసాగుతున్నాయని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ స్పష్టం చేశారు. దీనిపై ఆయన మాట్లాడుతూ, కరోనా నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులు, ఆంక్షలు కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వచ్చే వారు ఖచ్చితంగా అనుమతి తీసుకోవాల్సిందేనని తెలిపారు. స్పందన ద్వారా దరఖాస్తు చేసుకొని పాస్‌ (అనుమతి) తీసుకోవాలని చెప్పారు. పాస్‌ ఉన్న వారిని ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. రాష్ట్ర సరిహద్దులోని పోలీస్‌ చెక్‌పోస్టుల వద్ద థర్మల్‌ స్క్రీనింగ్‌ చేసిన తర్వాతే అనుమతిస్తారని చెప్పారు. పాస్‌లు ఉన్నప్పటికీ రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు అనుమతించేది లేదన్నారు. రాత్రి వేళల్లో అత్యవసర, నిత్యావసర సర్వీసులకు అనుమతి ఉంటుందన్నారు. పరిస్థితిని అర్థం చేసుకుని ప్రజలు సహకరించాలని డీజీపీ సూచించారు.

Next Story

Most Viewed