దేవునూరి తిరుపతి సేవలు మరువలేనివి..

by  |
దేవునూరి తిరుపతి సేవలు మరువలేనివి..
X

దిశ, మెదక్ : ఉమ్మడి మెదక్ జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా ఉండి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన దేవునూరి తిరుపతి సంతాప సభను సోమవారం మెదక్ పశుగణాభివృద్ధి సంస్థ కార్యాలయ ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. దేవునూరి తిరుపతి పాడి రైతులకు ఎన్నో సేవలు అందించారని కొనియాడారు.

రైతులకు గిట్టబాటు ధర కల్పించడం కోసం ఆయన చేసిన కృషి మరువలేని దన్నారు. కార్యక్రమంలో ఈఓ డాక్టర్ రాంజీ, జిల్లా డైరెక్టర్లు , నర్సింహా రెడ్డి, వెంకటేశం, శ్రీశైలం, సూర్ రెడ్డి, వెంకట్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అంతేకాకుండా ఇటీవల మరణించిన డైరెక్టర్ రాజు నాయక్‌కు జిల్లా కార్యవర్గం సంతాపం ప్రకటించింది.

Next Story

Most Viewed