మీ కోరికలు నెరవేరాలంటే శివునికి ఇలా అభిషేకం చేయాలట..

by Disha Web Desk 20 |
మీ కోరికలు నెరవేరాలంటే శివునికి ఇలా అభిషేకం చేయాలట..
X

దిశ, ఫీచర్స్ : మహాశివరాత్రి నాడు ప్రతి దేవాలయం భక్తులతో కిటకిటలాడుతుంది. ఈ రోజున భక్తులు నిండు భక్తితో శివున్ని పూజించి శివలింగానికి అభిషేకం చేస్తారు. మహాశివరాత్రి నాడు రుద్రాభిషేకం చేయడం చాలా ముఖ్యమైనది. రుద్రాభిషేకం చేయడం వలన కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం.

రుద్రాభిషేకంలో వినియోగించే పూజాసామాగ్రి..

శివునికి ఎంతో పవిత్రంగా చేసే రుద్రాభిషేకానికి ఆవు నెయ్యి, గంధం, తమలపాకులు, ధూపం, పువ్వులు, కర్పూరం, తీపి పదార్థాలు, పండ్లు, తేనె, పెరుగు, పాలు, డ్రై ఫ్రూట్స్, రోజ్ వాటర్, పంచామృతం, చెరకు రసం, కొబ్బరి నీరు, గంధపు నీటిని ఉపయోగిస్తారు. ఆవు కొమ్ముతో చేసిన శృంగి అనే పాత్రతో రుద్రాభిషేకం చేయడం శుభప్రదంగా పరిగణిస్తారు.

మహాశివరాత్రి నాడు ఇంట్లో రుద్రాభిషేకం ఇలా చేయండి..

మహాశివరాత్రి నాడు శివునికి రుద్రాభిషేకం చేస్తే సర్వరోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం. మహాశివరాత్రి నాడు రుద్రాభిషేకం చేసే సమయంలో శివ మంత్రాలను పఠించడం ద్వారా శుభఫలితాలు కలుగుతాయి.

ఇంట్లో రుద్రాభిషేకం చేయడానికి శివలింగాన్ని ఉత్తర దిశలో ప్రతిష్టించాలి. రుద్రాభిషేకం చేసే భక్తుని ముఖం తూర్పు వైపునకు తిరిగి ఉండాలి. అభిషేకం చేయడానికి శృంగిలో గంగాజలం పోసి అభిషేకాన్ని ప్రారంభించి, అదే శృంగితో, చెరకు రసం, తేనె, పెరుగు, పాలు, పంచామృతంతో సహా అన్ని ద్రవాలతో శివలింగానికి అభిషేకం చేయాలి. తర్వాత శివలింగం పై గంధపు చెక్కను పూయాలట. అనంతరం శివలింగానికి తమలపాకులు మొదలైన వాటిని సమర్పించాలి. శివునికి అభిషేకం చేసేటప్పుడు, మహామృత్యుంజయ మంత్రం, శివ తాండవ స్తోత్రం, ఓం నమః శివాయ లేదా రుద్ర మంత్రం వంటి ఏదైనా శివుని మంత్రాన్ని జపిస్తూ ఉండాలి.

అభిషేకం పూర్తయ్యాక మహాశివునికి నైవేద్యం సమర్పించాలి. దీని తరువాత శివుని ఏదైనా మంత్రాన్ని 108 సార్లు జపించి, ఆపై కుటుంబ సమేతంగా శివునికి ఆరతి చేయండి. ఇప్పుడు శివుడు ప్రతిష్ఠించిన నీటిని ఇంటి అంతటా చల్లి, ఆ నీటిని అందరికీ ప్రసాదంగా తాగడానికి ఇవ్వాలి.

రుద్రాభిషేకం ప్రాముఖ్యత..

జాతకంలో ఉన్న కాలసర్ప దోషం నుండి బయటపడటానికి రుద్రాభిషేకం ఎంతగానో ఇపయోగపడుతుంది. శివుని అనుగ్రహంతో గ్రహదోషాలు కూడా శాంతించి భక్తులు జీవితంలో పురోగమిస్తారు. మీరు మీ శత్రువుల పై విజయం సాధించాలనుకుంటే లేదా ఏదైనా పనిలో విజయం సాధించాలనుకుంటే రుద్రాభిషేకం చేయాలని పండితులు చెబుతున్నారు. సంతోషం, శాంతి, సంపద, ఆస్తి, కీర్తి మొదలైన వాటిని పొందేందుకు రుద్రాభిషేకం కూడా చేస్తారు.

కొత్త ఇల్లు లేదా వాహనం కోసం..

కొత్త ఇల్లు లేదా కొత్త కారు కొనాలనుకుంటే శివునికి పెరుగుతో రుద్రాభిషేకం చేయాలట.

సంపద కోసం

లక్ష్మీదేవిని పొందాలంటే చెరుకు రసంతో రుద్రాభిషేకం చేయాలని, ఐశ్వర్యం పెరగాలంటే తేనె, నెయ్యితో రుద్రాభిషేకం చేయాలని చెబుతారు.

గ్రహ దోషాలకు

గ్రహదోషాలకు గంగాజలంతో ఇంట్లోని కష్టాలు తొలగాలంటే పెరుగుతో రుద్రాభిషేకం చేయాలి.

శాంతి, ఆనందం కోసం...

సంతోషం, శాంతి కోసం శివునికి పాలతో రుద్రాభిషేకం చేయాలి.

సంతానం కలిగేందుకు..

మంచి సంతానం కలగాలంటే ఆవు పాలలో లేదా నీళ్లలో పంచదార కలిపి రుద్రాభిషేకం చేయాలి.

శత్రువులను జయించడం..

శత్రువుల పై విజయం సాధించాలంటే భస్మం లేదా ఆవనూనెతో రుద్రాభిషేకం చేయాలి. ఇలా చేయడం వల్ల శనిదేవుని దుష్ఫలితాలు కూడా తొలగిపోతాయని నమ్ముతారు.



Next Story

Most Viewed