- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tirumala: భక్తులతో కిక్కిరిసిన తిరుమల.. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిండిపోవడంతో సర్వదర్శనానికి దాదాపు 12 గంటల సమయం పడుతోంది.

దిశ, వెబ్డెస్క్: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు తిరుమల (Tirumala)కు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సమ్మర్ హాలిడేస్ రావడంతో కొండపై భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ (Vaikuntam Queue Complex)లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోవడంతో, భక్తులు వెలుపల ఉన్న క్యూలైన్లలో కిలోమీటర్ల మేర వేచి ఉన్నారు. ప్రస్తుతం తిరుమలలో రద్దీ దృష్ట్యా, టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం (SSD) కోసం సుమారు 12 గంటల సమయం పడుతోంది. ఎండల తీవ్రత దృష్ట్యా క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు టీటీడీ (TTD) అధికారులు నిరంతరాయంగా మంచినీరు, పాలు, అన్నప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు. సోమవారం స్వామివారిని 74,286 మంది భక్తులు దర్శించుకున్నారు. అదేవిధంగా 33,186 మంది భక్తులు మొక్కులు చెల్లించి తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.44 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
శ్రీవారి సేవలో భారత ఉప రాష్ట్రపతి..
నిర్ణీత షెడ్యూల్ ప్రకారం.. భారత ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ ఇవాళ ఉదయం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. ఆలయ అధికారులు ఆయనకు మహాద్వారం వద్ద స్వాగతం పలికి, దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం అందించనున్నారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను, శ్రీవారి చిత్రపటాన్ని సమర్పిస్తారు.






