Tirumala Temple: తిరుమలలో నేడు భక్తుల రద్దీ ఎలా ఉందంటే?

by Yella Dhawani Reddy |

కలియుగం దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది.

Tirumala Temple: తిరుమలలో నేడు భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
X

దిశ, వెబ్ డెస్క్: కలియుగం దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల కొండపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం 23 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. ఇక నిన్న శ్రీవారిని 70,169 మంది భక్తులు దర్శించుకోగా.. 24,559 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.4.33 కోట్లు సమకూరినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

Next Story