- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలలో స్వల్పంగా పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనం కోసం భక్తుల నిరీక్షణ
శుక్రవారం ఉదయం తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా పెరిగింది. శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు 25 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు.

దిశ, వెబ్డెస్క్: తిరుమలలో భక్తుల రద్దీ నిన్నటి కంటే ఈరోజు స్వల్పంగా పెరిగింది. శుక్రవారం ఉదయం 7 గంటల సమయానికి 25 కంపార్టుమెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. వీరిలో టోకెన్లు లేనివారికి స్వామివారి సర్వ దర్శనానికి 8 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. అలాగే సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్లు ఉన్నవారికి శ్రీవారి దర్శనానికి 3-5 గంటల సమయం పడుతుందని, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3-4 గంటల సమయం పడుతుందని టీటీడీ పేర్కొంది. కొత్తగా క్యూలైన్ల లోకి వెళ్లేవారికి భక్తుల రద్దీని బట్టి దర్శన సమయాలు పెరగవచ్చు లేదా తగ్గవచ్చని టీటీడీ తెలిపింది. ఇక నిన్న (గురువారం) స్వామివారిని 70,001 మంది భక్తులు దర్శించుకోగా.. 30,085 మంది భక్తులు తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా స్వామివారి హుండీ ఆదాయం రూ.3.77 కోట్లు సమకూరింది.
కాగా.. రెండ్రోజులుగా తిరుమలలో ఏదొక సమయంలో వర్షం కురుస్తుండటంతో.. భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మండుటెండల్లో తిరుమలకు చేరుకున్న తమకు.. ఈ వర్షాలతో కాస్త ఉపశమనం లభించిందని చెప్తున్నారు. తిరుమలలో వర్షాలు కురుస్తున్న వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తిరుమల కొండల్లో మేఘాలు కమ్ముకుని ఉండగా.. ఆ దృశ్యాలను చూసి పరవశించిపోతున్నారు.






