Tirumala: తిరుమలలో జోరు వర్షం.. అయినా తగ్గని భక్తుల రద్దీ

by Kema Shiva Kumar |

ఆపద మొక్కులవాడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)లో జోరుగా వర్షం కురుస్తోంది.

Tirumala: తిరుమలలో జోరు వర్షం.. అయినా తగ్గని భక్తుల రద్దీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఆపద మొక్కులవాడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)లో జోరుగా వర్షం కురుస్తోంది. నేటి నుంచి కార్తీక మాసం ప్రారంభమవుతోన్న వేళ భక్తుల రద్దీ కొనసాగుతోంది. మంగళవారం స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి భారీగా తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తుల దర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోంది. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి (Special Darshan) టోకెన్ తీసుకున్న వారికి కేవలం 4 గంటల్లో శ్రీవారి దర్శనం అవుతోంది. ఇక బుధవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ (Vaikuntam Que Complex)లోని 26 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. మంగళవారం స్వామి వారిని 76,343 మంది భక్తులు దర్శించుకున్నారు. అదేవిధంగా 18,768 మంది భక్తులు తమ తలనీలాలు సమర్పించి స్వామి వారి మొక్కలు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ (Srivari Hundi) ఆదాయం రూ.4.34 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు (TTD Offcials) వెల్లడించారు.

Next Story