స్త్రీల జన్మకు శివుడే కారణమా.. అందుకే అర్ధనారీశ్వరుడు అయ్యాడా ..?

by Disha Web Desk 20 |
స్త్రీల జన్మకు శివుడే కారణమా.. అందుకే అర్ధనారీశ్వరుడు అయ్యాడా ..?
X

దిశ, ఫీచర్స్ : హిందూ మతంలో శివునికి ప్రత్యేక స్థానం ఉంది. శివున్ని అనేక పేర్లతో భక్తులు పూజిస్తుంటారు. ఆ పేర్లలో మహాదేవ్, భోలేబాబా, అర్ధనారీశ్వరుడు అనే పేర్లు అత్యంత ప్రసిద్ధమైనవి. పరమశివుని అర్ధనారీశ్వరుని రూపంలో సగం శివునిగా సగం పార్వతిగా ఉంటారు. అందుకే శివుడిని అర్ధనారీశ్వరుడు అని పిలుస్తారు. శివుడు అర్ధనారీశ్వర రూపాన్ని ఎందుకు ధరించాల్సి వచ్చిందనే దాని వెనుక ఒక పెద్ద పురాణ కథ ఉంది. మరి ఆ పురాణగాథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పురాణాల ప్రకారం సృష్టి బాధ్యత బ్రహ్మకు అప్పగించారు. బ్రహ్మ ఆదిలో బ్రహ్మ మానసిక విశ్వాన్ని సృష్టించాడట. ఆ సృష్టి విస్తరించలేకపోయిందట. అప్పుడు బ్రహ్మ తాను సృష్టించిన ఈ సృష్టి విస్తరించదని, కొంతకాలం తర్వాత అది అంతరించిపోతుందని గ్రహించాడు. మళ్లీ మళ్లీ విశ్వాన్ని సృష్టించవలసి ఉంటుందని గ్రహించాడు. దీంతో బ్రహ్మ చాలా బాధపడ్డాడట.

అదే సమయంలో ఆకాశం నుండి ఒక ఆకాశవాణి బ్రహ్మదేవునికి వినిపించది. ఓ బ్రహ్మ! లైంగిక ప్రపంచాన్ని సృష్టించు అని ఆగిపోయింట. ఆకాశవాణి విన్న తర్వాత బ్రహ్మదేవుడు మైథుని విశ్వాన్ని సృష్టించాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఆ సమయంలో స్త్రీ పుట్టలేదు. అందుకే మైథుని విశ్వాన్ని ఎలా సృష్టించాలో బ్రహ్మదేవుడు ఏ నిర్ణయానికి రాలేకపోయాడు. అప్పుడు బ్రహ్మ ఈ సమస్యను శివుడు మాత్రమే పరిష్కరించగలడని భావించి, శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి కఠినమైన తపస్సును ప్రారంభించాడు.

అతని కఠోర తపస్సుకు సంతోషించిన పరమశివుడు ఒకరోజు అర్ధనారీశ్వరుని రూపంలో బ్రహ్మకు ప్రత్యక్షమయ్యాడు. దీని తరువాత శివుడు ఉమా దేవిని ఆమె శరీరంలోని సగం నుండి వేరు చేశాడు. ఈ విధంగా శక్తి శివుని నుంచి విడిపోయింది. దీని తర్వాత శక్తి తన కనుబొమ్మల మధ్య నుండి తన వలె అదే తేజస్సుతో మరొక శక్తిని సృష్టించింది. ఆమె దక్షుని ఇంట్లో అతని కుమార్తెగా అవతారం ఎత్తింది. ఈ విధంగా విశ్వం విస్తరణ కోసం, శివుడు అర్ధనారీశ్వరుని రూపాన్ని పొందాడు. అప్పటి నుండి శివుడిని అర్ధనారీశ్వరుడని పిలుస్తారు.

Next Story

Most Viewed