దేవాలయాల్లో ఈ నియమాలు తప్పనిసరిగా పాటించాలంటారు.. ఎందుకు ?

by Disha Web Desk 20 |
దేవాలయాల్లో ఈ నియమాలు తప్పనిసరిగా పాటించాలంటారు.. ఎందుకు ?
X

దిశ, ఫీచర్స్ : ప్రతిరోజూ మనలో చాలా మందికి దేవాలయాలకు వెళ్లే అలవాటు ఉంటుంది. ఆలయాలను ఆగమ నియమానుసారం నిర్మిస్తారు. ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయంలో కైంకర్యాలు నిర్వహిస్తారు. అంతేకాదు, ఆలయంలో స్వామివారిని దర్శించుకునే విధానం, ప్రదక్షిణ చేసే విధానం, ఆలయంలోని ముఖమంటపంలో భక్తులు కూర్చునే విధానం అన్నీ కూడా నియమానుసారం జరగాలి. ఆ నియమాలు ఏంటి? ఆలయంలోకి అగుడుపెట్టినప్పటి నుంచి బయటకు వచ్చేంత వరకు ఎలా ఉండాలి... ఏం చేయకూడదో తెలుసుకుందాం.

దేవాలయంలోకి అడుగుపెట్టిన తరువాత కొన్ని నియమాలను మనం ఖచ్చితంగా పాటిస్తాం. అయితే, కొంతమంది ఆ ఏమౌతుందిలే అని చెప్పి నిర్లక్ష్యం వహిస్తారు. ఇలా చేయడం ముమ్మూటికీ పాపమే. రాజగోపురం నుంచి గుడి ఆవరణలోకి అడుగుపెట్టిన తరువాత చేయకూడని పనులేంటో తెలుసుకుందాం. ఆలయంలోకి అడుగుపెట్టిన తరువాత పెద్ద పెద్దగా మాట్లాడకూడదు. లౌకిక విషయాలపై ప్రసంగాలు చేయకూడదు. పక్క వ్యక్తుల గురించి అస్సలు మాట్లాడకూడదు. ఈమధ్యకాలంలో గుడిలోకి వెళ్లాక సెల్‌ఫోన్లలో మాట్లాడటం అలవాటుగా మారింది. ఇలా చేయడం ముమ్మాటికీ పాపమేనని అంటున్నారు పెద్దలు. తోటి భక్తులకు ఇబ్బందులు కలిగేలా ప్రవర్తించకూడదు. అదేవిధంగా రజోగుణసంపన్నమైన విషయాలను ఆలయ ప్రాంగణంలో ప్రదర్శించకూడదు.

ప్రతీ ఆలయానికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. వస్త్రధారణ కూడా ముఖ్యమైనదే. ఆలయ నియమానుసారమే వస్త్రాలు ధరించి ఆలయంలోకి ప్రవేశించాలి. శౌచం లేకుండా, స్నానాదులు చేయకుండా, బొట్టు లేకుండా గుడకి వెళ్లరాదు. గుడికి వెళ్లేసమయంతో తమతో పాటు కనీసం ఒక పండైనా తీసుకొని వెళ్లాలి. స్వామివారికి నైవేధ్యం సమర్పించాలి. ఇక ప్రదక్షిణ చేసే విధానం కూడా ముఖ్యమే. గబగబా పరుగులు తీసినట్టుగా కాకుండా నిదానంగా చేయాలి. ప్రదక్షిణ చేయకుండా మూలమూర్తిని దర్శించుకోరాదు. అంతేకాదు, ముఖమంటపంలో గోడలకు ఆనుకొని కూర్చోవడం, కాళ్లు జాపుకొని కూర్చోకూడదు. స్వామివారి సన్నిధానంలో ఉండాలని బలంగా కోరుకునే భక్తులు... దేహాన్ని విడిచిన తరువాత ఆలయంలో ఇటుకలు, స్తంభాల రూపంలో వస్తారని నమ్ముతారు.



Next Story

Most Viewed