అక్షయ తృతీయ వెనక ఇన్ని స్టోరీలు ఉన్నాయా..

by Disha Web Desk 20 |
అక్షయ తృతీయ వెనక ఇన్ని స్టోరీలు ఉన్నాయా..
X

దిశ, ఫీచర్స్ : హిందూ మతంలో అక్షయ తృతీయను ఎంతో పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు. ఈ రోజున లక్ష్మీ, నారాయణుడిని ప్రత్యేకంగా పూజిస్తారు. అయితే ఎందుకు ఈ రోజుకు అంత ప్రత్యేకత ఉంది, ఈ రోజున ఉపవాసాలు ఎందుకు చేస్తారో అన్న విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ సారి అక్షయ తృతీయ 10 మే 2024న జరుపుకోనున్నారు. అక్షయ తృతీయను కొన్ని ప్రదేశాలలో అఖ తీజ్ అని కూడా పిలుస్తారు. ఇది వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలో వస్తుంది. పురాణాల ప్రకారం ఈ తేదీ చాలా శుభప్రదమైనది, ఫలవంతమైనదిగా చెబుతారు. అక్షయ తృతీయ రోజున లక్ష్మీ దేవిని పూజించి, బంగారం కొనుగోలు చేస్తే ఇంట్లో సంపదకు లోటు ఉండదని గ్రంథాలు చెబుతున్నాయి.

అక్షయ తృతీయ పౌరాణిక కథలు..

సత్యయుగం, త్రేతాయుగం అక్షయ తృతీయ రోజున ప్రారంభమైందని పురాణాలు చెబుతున్నాయి. దీనితో పాటు ద్వాపర యుగం కూడా ఈ రోజుతోనే ముగిసిందట. ఈ రోజున, నర-నారాయణుడితో పాటు పరశురాముడు, హయగ్రీవుడు అవతరించారని పురానగాథ. అలాగే ఇదే రోజున బద్రీనాథ్ తలుపులు తెరుచుకుంటాయి. అటు జగన్నాథుని అన్ని రథాలను తయారు చేసే పని కూడా ప్రారంభమవుతుందట.

ఈ రోజున ఏ సృజనాత్మక, ప్రాపంచిక పని చేసినా దాని ప్రతిఫలం మీకు లభిస్తుందని శ్రీ కృష్ణ భగవానుడు యుధిష్ఠిర్‌తో చెప్పాడని పురాణాలు చెబుతున్నాయి. అక్షయ తృతీయ రోజున వేద వ్యాసుడు, గణేశుడు మహాభారత గ్రంథాన్ని రాయడం ప్రారంభించారు. ఆదిశంకరాచార్య కనకధార మూలాన్ని కూడా ఇదే రోజున కూర్చారట. అక్షయ తృతీయ రోజున, బ్రహ్మదేవుని కుమారుడు అక్షయ్ కుమార్ జన్మించాడని, ఇదే రోజున కుబేరుడు నిధిని పొందాడని చెబుతారు. మహాభారత యుద్ధం కూడా అక్షయ తృతీయ రోజునే ముగిసిందట.

అక్షయ తృతీయ ఉపవాస నియమాలు..

ఈ రోజున ఉపవాసం ఉండాలంటే ఉదయం స్నానం చేసిన తర్వాత పసుపు రంగు దుస్తులు ధరించాలి. ఇంట్లో ఉన్న విష్ణుమూర్తి విగ్రహాన్ని గంగాజలంతో అభిషేకించి తులసి మాల, పసుపు పువ్వులు లేదా కేవలం పసుపు పుష్పాలను సమర్పించాలి. ఆ తరువాత ధూపం, నెయ్యి దీపం వెలిగించి పసుపు ఆసనం పై కూర్చోవాలి. విష్ణు సహస్రనామం, విష్ణు చాలీసా వంటి విష్ణువుకు సంబంధించిన గ్రంధాలను పఠించాలి. దీని తరువాత ప్రసాదాన్ని అందరికీ పంచాలి.



Next Story

Most Viewed