తిరుమలలో దర్శనానికి ఈ రోజు ఎంత సమయం పడుతోదంటే..!

by Disha Web Desk 9 |
తిరుమలలో దర్శనానికి ఈ రోజు ఎంత సమయం పడుతోదంటే..!
X

దిశ,వెబ్‌డెస్క్: కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనం కోసం వచ్చిన జనాలంతా 19 కంపార్ట్‌మెంట్‌లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు కల్పించే సర్వదర్శనానికి 24 గంటల పాటు క్యూ లైన్లో ఉండాల్సి వస్తోంది. ఏప్రిల్ 5(నిన్న) శ్రీవారిని 73,208 మంది దర్శనం చేసుకోగా..30,642 మంది ప్రజలు తలనీలాలు సమర్పించారు. ఈ మేరకు భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.12 కోట్లు వచ్చినట్లు టీటీడీ పేర్కొంది.



Next Story

Most Viewed