- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరుమలకు భక్తుల తాకిడి.. బాటగంగమ్మ గుడి వరకూ క్యూలైన్
తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది.

దిశ, వెబ్డెస్క్: తిరుమలకు భక్తుల తాకిడి భారీగా పెరిగింది. శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులతో అన్ని కంపార్టుమెంట్లు నిండి.. బాటగంగమ్మ గుడి వరకూ క్యూలైన్లో సర్వదర్శనానికి వేచి ఉన్నారు. ఉదయం 8 గంటల వరకూ క్యూలైన్లో ఉండి, టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం పడుతుందని టీటీడీ తెలిపింది. 8 గంటల తర్వాత క్యూలైన్లోకి వెళ్లిన భక్తులకు 24 గంటల సమయం పడుతుందని వెల్లడించింది. భక్తుల రద్దీని బట్టి టోకెన్ లేని భక్తుల దర్శనం వెయిటింగ్ సమయం మారుతుందని పేర్కొంది. కాగా.. సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు స్వామివారి దర్శనానికి 4-7 గంటల సమయం, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు 3-5 గంటల సమయం పడుతుందని పేర్కొంది. కాగా.. నిన్న (శనివారం) స్వామివారిని 77,864 మంది భక్తులు దర్శించుకోగా.. 39,348 మంది భక్తులు స్వామివారికి తలనీలాల మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా స్వామివారి హుండీ ఆదాయం రూ.3.33 కోట్లు సమకూరింది.






