'రూ.3 వేల టికెట్ తీసుకున్నా అనుమతించడం లేదు'

by Disha Web Desk 2 |
రూ.3 వేల టికెట్ తీసుకున్నా అనుమతించడం లేదు
X

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడ కనకదుర్గ ఆలయం వద్ద భక్తులు ఆందోళన చేస్తున్నారు. అంతరాలయ దర్శనానికి అనుమతి ఇవ్వాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. రూ.3 వేల టికెట్ తీసుకున్నా అనుమతించడం లేదని ఆలయ అధికారులపై మండిపడుతున్నారు. ఈ మేరకు గురువారం ఉదయం గుడిపైన ఉన్నటువంటి ఆలయ ఈవో ఆఫీసు ఎదుట ఆందోళన చేస్తున్నారు. కాగా, మరోవైపు అంతరాలయ ప్రవేశం లేదని భక్తులకు ఈవో భ్రమరాంబ తేల్చిచెప్పారు. ఆందోళన విరమించకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఈవో భ్రమరాంబ హెచ్చరికలు జారీ చేశారు. అయితే, తమకు అవకాశం కల్పించకుండా.. వీఐపీలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ అంతరాలయంలోకి అనుమతి ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Next Story

Most Viewed