తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

by Kema Shiva Kumar |

తిరుమలలో నేడు భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. మంగళవారం శ్రీవారి దర్శనం కోసం భక్తులు ఐదు కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమలలో నేడు భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. మంగళవారం శ్రీవారి దర్శనం కోసం భక్తులు ఐదు కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి సుమారు ఆరు గంటల సమయం పడుతోంది. సోమవారం శ్రీవారిని 68,365 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.65 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. అదేవిధంగా 27,818 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక ఈ నెల 22న ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

Next Story