ప్రపంచాన్ని పచ్చగా మార్చేద్దాం : దేవిశ్రీ ప్రసాద్

by  |
ప్రపంచాన్ని పచ్చగా మార్చేద్దాం : దేవిశ్రీ ప్రసాద్
X

మ్యూజిక్ డైరెక్టర్, రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గ్రీన్ ఇండియా చాలెంజ్ స్వీకరించారు. గార్డెనింగ్‌లో ఎక్స్‌పర్ట్ అయిన అమ్మ సూచనలు, మేనల్లుడు సాయంతో మొక్కలు నాటినట్లు తెలిపాడు. ఈ చాలెంజ్‌కు నామినేట్ చేసిన నిర్మాత రవి, ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టికి థాంక్స్ చెప్పిన దేవి.. గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్, గబ్బర్ సింగ్ హీరోయిన్ శృతి హాసన్‌ను నామినేట్ చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్‌ను అభినందించారు.

అంతేకాదు కృతి చెప్పినట్లుగా ‘ఉప్పెన’ సినిమాలో నీ కన్ను నీలి సముద్రం పాట నచ్చిన అందరినీ, అలాగే.. తన సంగీత అభిమానులు అందరినీ గ్రీన్ ఇండియా చాలెంజ్‌కు నామినేట్ చేస్తున్నట్లు తెలిపారు దేవి. ‘అందరం గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొని ఈ ప్రపంచాన్ని పచ్చగా మార్చేద్దాం’ అని పిలుపునిచ్చారు.

https://twitter.com/ThisIsDSP/status/1288026401258516480?s=19


Next Story