- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతులందరికీ బోర్లు వేయిస్తామని.. కొర్రీలు పెడ్తారా?
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్ : ఏపీలోని ప్రతి రైతుకూ బోర్లు వేయిస్తామని హామీలు ప్రకటించిన సీఎం జగన్.. తాజాగా ఒకసారి వేసుకున్న వారికి ఉచితం లేదని మెలిక పెట్టారని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ఇదివరకు వేసిన బోరు ఫెయిల్ అయితే, రైతు ఏం చేయాలని ప్రశ్నించారు. బోర్లు ఎండిన రైతులు వ్యవసాయానికి దూరం కావాల్సిందేనా అని ప్రశ్నించారు. ”ప్రతి రైతుకు బోరు అని పథకంలో చెప్పి.. ఒకసారి వేస్తే ఉచితం లేదని మెలిక […]</p>

X
దిశ, వెబ్డెస్క్ :
ఏపీలోని ప్రతి రైతుకూ బోర్లు వేయిస్తామని హామీలు ప్రకటించిన సీఎం జగన్.. తాజాగా ఒకసారి వేసుకున్న వారికి ఉచితం లేదని మెలిక పెట్టారని మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ఇదివరకు వేసిన బోరు ఫెయిల్ అయితే, రైతు ఏం చేయాలని ప్రశ్నించారు. బోర్లు ఎండిన రైతులు వ్యవసాయానికి దూరం కావాల్సిందేనా అని ప్రశ్నించారు.
”ప్రతి రైతుకు బోరు అని పథకంలో చెప్పి.. ఒకసారి వేస్తే ఉచితం లేదని మెలిక పెట్టారు. బోరు ఫెయిల్ అయితే రైతు ఏం చేయాలి? బోరు ఎండిన రైతులు వ్యవసాయానికి దూరం కావాల్సిందేనా? అర్హత ఉన్న 1,100 గ్రామాలను ఎందుకు విస్మరించారు? మీ హయాంలో రైతులకు జలకళ తప్పిన మాట వాస్తవం కాదా? జగన్ చెప్పాలి” అంటూ దేవినేని ఫైర్ అయ్యారు.
Next Story






