- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు సాయికృపానగర్లో మున్నూరు కాపు సంఘం భవనాన్ని తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఆదివారం పద్మశాలి సంఘం, రజక సంఘం భవనాల నిర్మాణాలకు పోచారం భూమి పూజ చేశారు. కళ్యాణ లక్ష్మి 30 చెక్కులు, షాదీ ముబారక్ 6 చెక్కులు.. మొత్తం రూ. 36,04,176 విలువ ఉన్న 36 చెక్కులను నస్రుళ్లబాద్ లబ్ధిదారులకు శ్రీనివాస్ రెడ్డి అందచేశారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, ఆర్డీవో రాజా గౌడ్, బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, కామారెడ్డి జిల్లా రైతు బంధు అధ్యక్షులు అంజిరెడ్డి, మండల ఎఎంసీ చైర్మన్ పాత బాలకృష్ణ, ప్యాక్స్ చైర్మన్ కృష్ణారెడ్డి, ఎఎంసీ వైస్ చైర్మన్ దాసరి శ్రీనివాస్, షాదీఖాన చైర్మన్ వాహబ్, స్థానిక కౌన్సిలర్ రమాదేవి, కౌన్సిలర్లు పాశం రవీందర్ రెడ్డి, నంద కిషోర్, హకీమ్, రాఫీక్, కార్యకర్తలు పాల్గొన్నారు.