చనిపోయిన వారు తిరిగి వస్తారా.. మరణాలపై చర్చ అనవసరం : సీఎం

by  |
చనిపోయిన వారు తిరిగి వస్తారా.. మరణాలపై చర్చ అనవసరం : సీఎం
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో సెకండ్ వేవ్‌లో భాగంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. హర్యానాలో కూడా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో హర్యానా సీఎం మనోహార్‌లాల్ ఖట్టర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనాతో ఎంత మంది చనిపోయారు.. రోజుకు ఎన్ని కరోనా మరణాలు నమోదు అవుతున్నాయి అనే డాటాపై చర్చ అనవసరం.. మరణించిన వారు తిరిగి వస్తారా అని కామెంట్స్ చేశారు.

మృతి చెందిన వారి గురించి కాకుండా ప్రస్తుతం కరోనా సోకి చికిత్స తీసుకుంటున్న వారి ఆరోగ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆస్పత్రుల్లో కరోనా రోగులకు తగు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉందని అన్నారు.



Next Story

Most Viewed