బైకుని ఢీకొని పొలాల్లోకి దూసుకెళ్లిన కారు

by  |
బైకుని ఢీకొని పొలాల్లోకి దూసుకెళ్లిన కారు
X

దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లాలో సోమవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నంద్యాల-ఆళ్లగడ్డ రోడ్డు మార్గంలోని దిబగుంట్ల మెట్ట వద్ద కారు, బైకును ఢీకొంది. దీంతో బైకుపై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అదుపు తప్పిన కారు పక్కనే ఉన్న పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Next Story

Most Viewed