బ్రేకింగ్.. నల్లమలలో హాజీపూర్ వద్ద బలగాల మోహరింపు..

by  |
బ్రేకింగ్.. నల్లమలలో హాజీపూర్ వద్ద బలగాల మోహరింపు..
X

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గ పరిధిలో గల హాజీపూర్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. మంగళవారం హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ, సీపీఎం, సీపీఐ, టీడీపీ, వైఎస్సార్ టీఎస్ ఆధ్వర్యంలో పోడు భూముల సమస్యల పరిష్కారం కోసం నల్లమల సడక్ బంద్‌కు పిలుపునిచ్చారు.

ఈ నేపథ్యంలో హజీపూర్ చౌరస్తాలో నాగర్ కర్నూలు జిల్లా నాలుగు డివిజన్ల నుండి డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు సుమారు 200 మంది పోలీసులు ఆ ప్రాంతంలో మోహరించారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమానికి అన్ని పార్టీల నుండి నేతలు హాజరవుతున్న నేపథ్యంలో ఏం జరుగుతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటలకు వరకు నల్లమల సడక్ బంద్ కార్యక్రమం ఉంటుందని అఖిలపక్ష నాయకులు పిలుపునిచ్చారు.



Next Story