- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, కొత్తగూడ : కొత్తగూడ మండలంలోని ప్రాథమికోన్నత పాఠశాలను డీఈఓ సోమశేఖర్ శర్మ ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలోని అన్ని రికార్డులను పరిశీలించారు. అనంతరం తరగతి గదుల శానిటైజేషన్, పాఠశాల ఆవరణలోని పరిశుభ్రత, టాయిలెట్లను పరిశీలించారు. ఉపాధ్యాయుల హాజరు శాతం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి బోధన విధానం, సౌకర్యాలు గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలో అందరూ సామాజిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని సూచించారు. విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విద్యార్థులు మాస్క్లు, శానిటైజర్ తప్పనిసరిగా ఉపయోగించాలన్నారు. పాఠశాలలో విద్యాబోధన చూసి ఉపాధ్యాయుల బృందాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఎంవో శ్రీ రాములు, ఎంఈవో శ్రీ దేవి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజశేఖర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.