- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : ఆస్తి పన్ను కట్టలేకనే బకాయి పడ్డ ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా బుక్కయ్యాడు రెవెన్యూ ఇన్ స్పెక్టర్. తిరుపతి కార్పొరేషన్ పరిధిలోని శ్రీదేవి కాంప్లెక్స్ ఎదురుగా నర్సింహ రెడ్డి అనే వ్యక్తి బట్టల దుకాణం నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో అతడు తిరుపతి నగరపాలక సంస్థకు ఆస్తి పన్ను బకాయి పడ్డాడు. దానిని మాఫీ చేయడానికి కార్పొరేషన్ రెవెన్యూ ఇన్ స్పెక్టర్ రఫీ రూ.9 వేలు డిమాండ్ చేశాడు. ఆర్థిక ఇబ్బందులతోనే ఆస్తి పన్ను కట్టలేని స్థితిలో ఉన్న నర్సింహారెడ్డి అంత ఇచ్చుకోలేనని బతిమిలాడాడు. అయినా ఆయన వినకపోవడంతో ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చాడు. వారి సూచన మేరకు తన షాప్ లోనే డబ్బులు ఇస్తానని చెప్పడంతో అక్కడికి వచ్చిన రఫీ.. రూ.9 వేలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు.
Next Story