- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రభుత్వ ఆస్పత్రులు, కొన్ని ప్రైవేట్ హాస్పిటళ్లను ఇక్కడి స్థానికుల కోసం రిజర్వ్ చేసినట్టు సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీ సర్కారు ఆస్పత్రుల్లోని 10వేల పడకలు, ఢిల్లీవాసులకే కేటాయిస్తామని వివరించారు. కేంద్ర ప్రభుత్వ హాస్పిటల్ బెడ్స్ మాత్రం అందరికి అందుబాటులో ఉంటాయని, అలాగే, స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చే ప్రైవేట్ హాస్పిటళ్లూ అందరికీ సేవలందిస్తాయని పేర్కొన్నారు. ఈ ప్రకటన చేస్తూనే సోమవారం నుంచి ఢిల్లీ సరిహద్దులను తెరుస్తున్నట్టు వెల్లడించారు. సరిహద్దులను తెరిస్తే దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి పేషెంట్లు ఢిల్లీలోని హాస్పిటళ్లను ముంచెత్తే ప్రమాదముందని భావించి బార్డర్లను మూసి ఉంచే నిర్ణయాన్ని కేజ్రీవాల్ సర్కారు తీసుకున్న విషయం తెలిసిందే. ఢిల్లీవాసులకు సరిపడా పడకలు అందుబాటులో ఉన్నాయని, కొందరు దళారులు మాత్రం బెడ్లతో బ్లాక్మార్కెటింగ్ చేస్తున్నారని, వారిని వదిలేది లేదని ఇటీవలే పేర్కొన్నారు.