- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సింఘు బోర్డర్లో పోలీసుపై ఖడ్గంతో దాడి..
<p>దిశ, వెబ్డెస్క్ : కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన అగ్రి చట్టాలను వ్యతిరేకిస్తూ రిపబ్లిక్ డే రోజున రైతు సంఘాలు తలపెట్టిన ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన విషయం తెలిసిందే. ఎర్రకోటపై నిరసనకారులు జెండా ఎగరేసిన ఘటన తర్వాత పరిణామాలు వేగంగా మార్పు చెందాయి. రైతు సంఘాల్లో చీలికతో పాటు ఢిల్లీ సరిహద్దులను ఖాళీ చేయాలని రైతులకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం సింఘు బోర్డర్ వద్ద నిరసన కారులకు పోలీసులకు మధ్య […]</p>

X
దిశ, వెబ్డెస్క్ : కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన అగ్రి చట్టాలను వ్యతిరేకిస్తూ రిపబ్లిక్ డే రోజున రైతు సంఘాలు తలపెట్టిన ర్యాలీ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన విషయం తెలిసిందే. ఎర్రకోటపై నిరసనకారులు జెండా ఎగరేసిన ఘటన తర్వాత పరిణామాలు వేగంగా మార్పు చెందాయి. రైతు సంఘాల్లో చీలికతో పాటు ఢిల్లీ సరిహద్దులను ఖాళీ చేయాలని రైతులకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.
ఈ నేపథ్యంలోనే శుక్రవారం సింఘు బోర్డర్ వద్ద నిరసన కారులకు పోలీసులకు మధ్య ఉద్రిక్తత నెలకొంది. నిరసన కారులను కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించిన స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO)పై ఓ ఆందోళన కారుడు ఖడ్గంతో దాడి చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోను ఢిల్లీ పోలీసులు షేర్ చేశారు. అనంతరం చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చిందని తెలిపారు.
Next Story






