- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అబార్షన్ కోసం కోర్ట్ మెట్లెక్కిన తల్లి.. అదే ఉత్తమమన్న హైకోర్ట్
<p>దిశ,వెబ్డెస్క్: సృష్టిలోనే మధురమైనది..అమ్మతనం… వివాహమైన ప్రతి మహిళ మాతృత్వం పొందాలని… పండంటి బిడ్డకు జన్మనివ్వాలని ఎన్నో కలలు కంటుంది. కానీ అదే గర్భం దాల్చిన తల్లి తనకు అబార్షన్ చేయాలని ఢిల్లీ హైకోర్ట్ ను ఆశ్రయించింది. విచారణ చేపట్టిన కోర్ట్ సైతం ఆమె అబార్షన్ చేయించుకోవడమే ఉత్తమమని సలహా ఇచ్చింది. ఓ గర్భిణీ తనకు అబార్షన్ చేయించుకునేందుకు అనుమతికావాలంటూ ఢిల్లీ హైకోర్ట్ ను కోరింది. అనెన్సుఫాలీ సమస్యతో బాధపడుతున్నట్లు కోర్ట్ కు తెలిపింది. అల్ట్రాసౌండ్ స్కానింగ్ లో […]</p>

దిశ,వెబ్డెస్క్: సృష్టిలోనే మధురమైనది..అమ్మతనం… వివాహమైన ప్రతి మహిళ మాతృత్వం పొందాలని… పండంటి బిడ్డకు జన్మనివ్వాలని ఎన్నో కలలు కంటుంది. కానీ అదే గర్భం దాల్చిన తల్లి తనకు అబార్షన్ చేయాలని ఢిల్లీ హైకోర్ట్ ను ఆశ్రయించింది. విచారణ చేపట్టిన కోర్ట్ సైతం ఆమె అబార్షన్ చేయించుకోవడమే ఉత్తమమని సలహా ఇచ్చింది. ఓ గర్భిణీ తనకు అబార్షన్ చేయించుకునేందుకు అనుమతికావాలంటూ ఢిల్లీ హైకోర్ట్ ను కోరింది. అనెన్సుఫాలీ సమస్యతో బాధపడుతున్నట్లు కోర్ట్ కు తెలిపింది. అల్ట్రాసౌండ్ స్కానింగ్ లో తన గర్భంలో ఉన్న పిండం పుర్రెభాగంలో ఎముకల ఎదుగుదల సమస్య తలెత్తినట్లు డాక్టర్లు చెప్పారని, గర్భిణీ కోర్ట్ కు సంబంధింత రిపోర్ట్ లను అందజేశారు. అయితే మహిళా పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్ట్ ఎయిమ్స్ డాక్టర్ల ఆధ్వర్యంలో మరోసారి పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల్లో అనెన్సుఫాలీ సమస్య ఉన్నట్లు ఎయిమ్స్ డాక్టర్లు నిర్ధారించారు. దీంతో బాధితురాలి అబార్షన్ కు ఢిల్లీ హైకోర్ట్ చీఫ్ జస్టిస్ డీఎన్ పటేల్, జస్టీస్ జ్యోతీ సింగ్ ల బెంచ్ అనుమతిస్తూ తీర్పు వెల్లడించింది.
,






