నలుగురిని వేర్వేరుగా ఉరితీయద్దు..

by  |
నలుగురిని వేర్వేరుగా ఉరితీయద్దు..
X

నిర్భయ కేసులో ఢిల్లీ హైకోర్టు బుధవారం సంచలన తీర్పునిచ్చింది. నలుగురు నిందితులను వేర్వేరుగా ఉరితీయద్దని అందరిని ఒకేసారి శిక్షించాలని స్పష్టం చేసింది. ఈ కేసులో ఢిల్లీ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది. దీంతో నిందితులకు శిక్ష అమలు చేసేందుకు వారం రోజుల గడువునివ్వగా ఈలోపు న్యాయపరమైన అంశాలన్నింటిని పూర్తి చేయాలని ఆదేశించింది.మెర్సిపిటిషన్ పెండింగ్‌లో ఉంటే ఇతర దోషులకు శిక్ష విధించాలని జైలు నిబంధలు చెప్పడం లేదని తెలిపింది. ఇదిలా ఉండగా అధికారుల నిర్లక్ష్యం వల్లే రివ్యూ పిటిషన్‌పై విచారణ ఆలస్యమైందని హైకోర్టు వ్యాఖ్యానించింది.



Next Story

Most Viewed