వారిని వెంటనే విధుల్లోకి తీసుకోండి.. హైకోర్టు కీలక ఆదేశాలు

by  |
వారిని వెంటనే విధుల్లోకి తీసుకోండి.. హైకోర్టు కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్ : భారత విమాన సంస్థ ఎయిర్ ఇండియాలో పైలట్ల తొలగింపుపై ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. తమను విధుల్లో నుంచి తొలగించడంపై ఎయిర్ ఇండియా ఉద్యోగులు దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా గతేడాది తొలగించిన పైలట్లను వెంటనే మళ్లీ విధుల్లోకి చేర్చుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేగాకుండా వారికి బాకీ ఉన్న వేతనాలను కూడా చెల్లించాలని తాజా ఆదేశాల్లో పేర్కొంది. ఈ తీర్పునకు సంబంధించిన పూర్తి వివరాలను బుధవారం వెల్లడించనున్నట్టు కోర్టు స్పష్టం చేసింది.


Next Story

Most Viewed