వైద్యులకు 5 స్టార్ హోటల్లో బస: ఢిల్లీ ప్రభుత్వం

by  |
వైద్యులకు 5 స్టార్ హోటల్లో బస: ఢిల్లీ ప్రభుత్వం
X

న్యూఢిల్లీ: కోవిడ్ 19 బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్యులకు ఐదు నక్షత్రాల హోటల్లో బస ఏర్పాటు చేయనున్నట్టు ఢిల్లీ ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రభుత్వ ఆస్పత్రులు అయిన లోక్ నాయక హాస్పిటల్, జీబీ పంత్ హాస్పిటల్ లో కరోనా వైరస్ పేషెంట్లకు వైద్యం అందిస్తున్న డాక్టర్లకు ఈ సదుపాయం కల్పిస్తున్నట్లు ఆరోగ్య మరియ కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. ఈ రెండు ఆస్పత్రులకు రెండు కిలోమీటర్ల దూరంలోని లలిత్ హోటల్ లో 100 రూములను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపింది. హోటల్ ఖర్చులను ప్రభుత్వమే భరించనుందని వివరించింది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ ట్వీట్ చేశారు.

Tags : Doctors, covid 19,five star hotel, delhi government

Next Story

Most Viewed