‘ఢిల్లీ క్రైమ్’ సీజన్2 రీ-షూట్ ఫర్ గ్లోబల్ రీచ్

by  |
Delhi Crime-2 poster
X

దిశ, సినిమా: ‘ఢిల్లీ క్రైమ్’ బెస్ట్ డ్రామా సిరీస్ కేటగిరిలో ఎమ్మీ అవార్డు అందుకుని వరల్డ్ వైడ్‌గా పాపులర్ అయింది. మార్చి 22, 2019లో నెట్‌ఫ్లిక్స్‌‌లో రిలీజ్ అయిన సిరీస్..యాక్టర్స్ అమేజింగ్ పర్‌ఫార్మెన్స్, ప్యాక్డ్ స్క్రిప్ట్, రియలిజంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ క్రమంలో సీక్వెల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 2020 లోనే సీజన్ 2 షూటింగ్ ప్రారంభం కాగా 2021 సెకండ్ హాఫ్‌లో రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు మేకర్స్. అయితే ‘ఢిల్లీ క్రైమ్’ ఎమ్మీ అవార్డ్ సంపాదించి గ్లోబల్‌ అటెన్షన్ క్యాచ్ చేయడంతో సీక్వెల్ కూడా అదే రేంజ్‌లో ఉండాలనే ఉద్దేశంతో కొన్ని పోర్షన్స్ రీషూట్ చేస్తున్నారు. యాక్టర్స్, క్రూ మెంబర్స్ అందరూ ఇందుకు అంగీకరించడంతో ప్రస్తుతం మళ్లీ షూటింగ్ ప్రారంభించారు.

గతంలో జరిగిన ‘ఢిల్లీ క్రైమ్ 2’ చిత్రీకరణతో మేకర్స్ హ్యాపీగా ఉన్నా ఫస్ట్ సీజన్‌‌కు మించిన బెస్ట్ ఔట్ పుట్ ఇచ్చేందుకు ఉన్న ఏ అవకాశాన్ని వదులుకోలేమని చెప్తున్నారు. భారత్ మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ సిరీస్ కోసం అభిమానులు వెయిట్ చేస్తుండటంతో మరింత మెరుగ్గా కంటెంట్ ప్రెజెంట్ చేయాలనుకుంటున్నామని తెలిపారు. అందుకే సిరీస్‌లో కొంత పోర్షన్ రీషూట్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు.



Next Story