- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
న్యూఢిల్లీ: ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యంత్రి అరవింద్ కేజ్రీవాల్కు మంగళవారం నిర్వహించిన వైద్య పరీక్షలో నెగెటివ్గా తేలింది. జ్వరం, గొంతు నొప్పి రావడంతో కేజ్రీవాల్ స్వీయ నిర్బంధంలోకి వెళ్తున్నట్టు సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం నాటికి ఆయన ఆరోగ్య పరిస్థితి కొంచెం మెరుగుపడిందని ఆప్ వర్గాలు తెలిపాయి. ఆదివారం మధ్యాహ్నం కేజ్రీవాల్ అనారోగ్యానికి గురయ్యారు. అప్పటినుంచి ఆయన ఎవరినీ కలవలేదు. ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో స్వీయ నిర్బంధంలో ఉన్నారు. ‘కరోనా లక్షణాలైన జ్వరం, గొంతు నొప్పి ఉండటంతో కేజ్రీవాల్కు మంగళవారం కరోనా పరీక్షలు చేశారు. అనంతరం రిపోర్టులో నెగెటివ్గా వచ్చింది. ఇది చాలా ఊరటనిచ్చే విషయం. ఎందుకంటే ఆయనకు మధుమేహం ఉంది’ అని ఆప్ ఎమ్మెల్యే చద్దా తెలిపారు.
Next Story