మద్యం హోం డెలివరీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..

by  |
మద్యం హోం డెలివరీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..
X

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా వేళ మందుబాబులకు ఢిల్లీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆన్‌లైన్‌లో మద్యం విక్రయాలకు కేజ్రీవాల్ ప్రభుత్వం అనుమతినిచ్చింది. మద్యం హోం డెలివరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మద్యం ఆర్డర్ చేసుకునేందుకు వెబ్ పోర్టల్ లేదా యాప్‌ను ఉపయోగించాలని ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. ఆన్‌లైన్‌లో హోం డెలివరీ కోసం దేశీయ, విదేశీ మద్యం కొనుగోలు చేసుకునేందుకు తగిన ఏర్పాట్టు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. ఇళ్లతోపాటు హాస్టళ్లు, ఆఫీసులు, సంస్థలకు కూడా మద్యం పంపిణీ చేయనున్నారు.



Next Story

Most Viewed