డిగ్రీ పరీక్ష ఫీజు గడువు పెంపు

by  |
డిగ్రీ పరీక్ష ఫీజు గడువు పెంపు
X

దిశ, నిజామాబాద్ రూరల్: కరోనా నిబంధనల దృష్ట్యా డిచ్‌పల్లి మండల కేంద్రంలో గల తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ., బి.ఎ.(ఎల్) కోర్సులకు చెందిన మొదటి సెమిస్టర్ రెగ్యూలర్ పరీక్షలకు ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా (రివైస్డ్ నోటిఫికేషన్) ఈ నెల 20 వ తేదీ వరకు ఫీజు గడువు పెంపుచేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి పాత నాగరాజు నిర్ణయించారు. రూ.100 రూపాయల ఆలస్య రుసుముతో ఈ నెల 22 వరకు, రూ.200 వ౦దల రూపాయల ఆలస్య రుసుముతో ఈ నెల 25 వరకు, రూ.1000 రూపాయల ఆలస్య రుసుముతో ఈ నెల 28 వరకు ఫీజును చెల్లించవచ్చని నాగరాజు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం యూనివర్సిటి వెబ్ సైట్ www.telanganauniversity.ac.in ను సంప్రదించగలరని పేర్కొన్నారు.

Next Story

Most Viewed