ఉగ్రవాదుల డ్రోన్ దాడులు.. రాజ్‌నాథ్‌తో మోడీ అత్యవసర భేటీ

by  |
Rajnath-singh,-Pm-Modi
X

దిశ, వెబ్‌డెస్క్ : జమ్మూ కాశ్మీర్‌లో డ్రోన్ల దాడులు జరుగుతున్నాయి. వరుసగా కాశ్మీర్‌లో మూడో రోజు కూడా డ్రోన్లు చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో.. కాసేపట్లో ప్రధాని మోడీ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రదాడి ఘటనలపై మోడీ సమీక్షించనున్నారు. ఈ క్రమంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఢిల్లీ చేరుకున్నారు. డ్రోన్ల దాడిపై ప్రధానికి రాజ్‌నాథ్ సింగ్ వివరించనున్నారు. అయితే, జమ్మూలో ఉగ్రవాదులు డ్రోన్ల సాయంతో బాంబు దాడులకు పాల్పడుతున్నారు. ఈ దాడుల్లో వైమానిక సిబ్బంది గాయపడిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed