బిపిన్ రావత్ ఇంటికి రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

by  |
బిపిన్ రావత్ ఇంటికి రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: డిఫెన్స్ చీఫ్ బిపిన్ రావత్ ఇంటికి కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేరుకున్నారు. ఆయన వెంట కొంతమంది ఆర్మీ ఉన్నతాధికారులు ఉన్నారు. బిపిన్ రావత్ మరణం గురించి జరుగుతున్న ప్రచారంపై రాజ్‌నాథ్ క్లారిటీ ఇచ్చే అవకాశముంది. బిపిన్ రావత్ ఇంటి దగ్గర పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో 11 మంది దుర్మరణం పాలవ్వగా.. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో బిపిన్ రావత్ మరణించారా? లేదా గాయపడ్డారా అనే విషయంపై కేంద్రం ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

Next Story

Most Viewed