డార్లింగ్ సరసన పద్మావతి!

by  |
డార్లింగ్ సరసన పద్మావతి!
X

బాహుబలి చిత్రంతో.. పాన్ ఇండియా లెవెల్‌లో క్రేజ్ సంపాదించుకున్న హీరో ప్రభాస్. ఈ యంగ్ రెబల్ స్టార్ తాజాగా ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్’ చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు ఈ సినిమా అప్‌డేట్ కోసం ప్రభాస్ అభిమానులు ఎంతగా వెయిట్ చేశారో తెలియంది కాదు. ఈ సినిమా తర్వాత ప్రభాస్ ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ వరల్డ్ స్థాయిలో ఓ చిత్రం రూపొందనుండగా.. అభిమానులకు ఊహించని సర్‌ప్రైజ్‌లు ఉంటాయని నాగ్ అశ్విన్ మొదటి నుంచి చెబుతూనే ఉన్నాడు. ఇప్పటికే తన మొదటి రెండు చిత్రాలతో నాగ్ అశ్విన్ మంచి టాలెంట్ ఉన్న దర్శకుడిగా పేరు సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలో నాగ్, ప్రభాస్ కాంబో అనగానే ప్రేక్షకుల్లో అంచనాలు ఆకాశాన్నంటుతాయనడంలో సందేహం లేదు. దానికి తగ్గట్లే నాగ్ అశ్విన్ సినిమా ఉంటుందని ఇప్పటికే వెల్లడించారు. ఈ క్రమంలోనే.. రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఊహించని విధంగా ఈ చిత్రం నుంచి ఆదివారం ఉదయం ఓ సర్‌ప్రైజ్‌ ఇస్తున్నట్లు.. వైజయంతీ మూవీస్ ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. అన్నట్లుగానే.. అభిమానులు ఎక్స్‌పెక్ట్ చేయని బహుమతిని ప్రభాస్ 21వ చిత్ర బృందం ఇచ్చింది. అదేంటంటే.. మన రెబల్ కింగ్ సరసన నటించే క్వీన్ దీపికా పదుకునే అని రివీల్ చేసింది.

నాగ్ అశ్విన్, ప్రభాస్ కలయికలో వస్తున్న చిత్రాన్ని వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ బ్యానర్ గురించి పరిచయం చేయాల్సిన పనిలేదు. వైజయంతీ బ్యానర్ ఇప్పటికే ఎంతోమంది బాలీవుడ్ బ్యూటీలను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేసింది. కాగా, ఈ సారి బాలీవుడ్ భామ దీపికా పదుకునేను టాలీవుడ్‌కు ఇంట్రడ్యూస్ చేస్తోంది. ‘కింగ్‌కు సరిపడే.. క్వీన్ కావాలి కదా. మరి చాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది. పిచ్చెక్కిచ్చేద్దాం’ అంటూ నాగ్ అశ్విన్ ట్వీట్ చేశారు. కాగా, ప్ర‌భాస్ చివ‌రి చిత్రం సాహోతో బాలీవుడ్ భామ శ్ర‌ద్ధా క‌పూర్ తెలుగు తెర‌కు ప‌రిచ‌యమైన విష‌యం తెలిసిందే.


Next Story

Most Viewed