- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, సినిమా: కరోనా సెకండ్ వేవ్తో దేశ ప్రజలు భయానక పరిస్థితులు ఎదుర్కొంటున్న క్రమంలో బాధితులకు సెలబ్రిటీలు తమ వంతుగా మద్దతిస్తున్నారు. హోప్ఫుల్ మెసేజ్లతో ధైర్యం చెప్తూనే.. ఆక్సిజన్, బెడ్ అవెలబిలిటీ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఆర్థికంగా సాయం చేసేందుకు కూడా ముందుకొస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే మెంటల్ హెల్త్ గురించి కేర్ తీసుకోవడం చాలా ముఖ్యమని సూచించింది. మెంటల్ హెల్త్ హెల్ప్ లైన్స్ ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆమె.. ‘ఈ కష్టంలో మీరు ఒంటరి కాదు’ అని అభిమానులకు ధైర్యం చెప్పేందుకు ప్రయత్నించింది. ‘ఈ కష్టం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో.. నేను, నా ఫ్యామిలీతో పాటు మిలియన్ మంది ప్రజలు మీకు తోడుగా ఉన్నారు. ప్రస్తుత సంక్షోభంలో మానసిక క్షేమం ముఖ్యమైందని మరిచిపోవద్దు. గుర్తుంచుకోండి! మీరు ఒంటరిగా లేరు. మేము మీతో పాటే ఉన్నాము. ముఖ్యంగా మీ దగ్గర నమ్మకం ఉంది’ అంటూ ఎమోషనల్ నోట్ షేర్ చేసింది.