ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు

by  |
covid
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతుంది. వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో 65,500 సాంపుల్స్ పరీక్షించగా 1,506 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 19,93,697కి పెరిగింది. అదేసమయంలో కరోనాతో 16 మంది మరణించారు. తాజా మరణాలతో కలుపుకుని మహమ్మారితో మరణించిన వారి సంఖ్య 13,647 కి చేరింది. నిన్న ఒక్కరోజులో 1,835మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 19,62,185కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 17,865 యాక్టివ్‌ కేసులున్నట్లు వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,56, 61,449 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.


Next Story