హైతీలో భారీ భూకంపం.. 1300లకు చేరిన మృతుల సంఖ్య

by  |
హైతీలో భారీ భూకంపం.. 1300లకు చేరిన మృతుల సంఖ్య
X

దిశ, వెబ్‌డెస్క్ : హైతీలో శనివారం రోజున భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. అయితే భూకంపం ధాటికి ఇప్పటికే 1300పైగా మృతి చెందినట్టు సమాచారం. ఈ భూకంపం విధ్వంసానికి వందలాది భవనాలు నేల మట్టం కావడంతో శిధిలాల కింద చిక్కున్న వారిని ర‌క్షించేందుకు స‌హాయ‌క చ‌ర్యలు కొన‌సాగుతున్నాయి. రాజ‌ధాని పోర్ట్ ఓ ప్రిన్స్‌కు 125 కిలోమీట‌ర్ల దూరంలో భూకంప‌కేంద్రం ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. మృతుల సంఖ్య మ‌రింత‌గా పెరిగే అవ‌కాశం ఉన్నట్టు అధికారులు అంచ‌నా వేస్తున్నారు.


Next Story