ఇటలీలో ఆగని మృత్యుఘోష

by  |

ఇటలీలో రాకాసి కరోనా ఉగ్రరూపం దాల్చింది. ఈ మహమ్మారి బారిన పడి మృతి చెందుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. కేవలం 24గంటల్లోనే ఈ దేశంలో కరోనా కారణంగా 969మంది మృత్యు ఒడిలోకి జారుకున్నారు. ఒక్క రోజులో అత్యధికంగా మృతి చెందడం ఇదే తొలిసారి. ఎటు చూసినా కరోనా రోగులు, మృతులతో ఆ దేశం విలవిల్లాడుతోంది. ఇంతదారుణంగా ఈ వైరస్ వ్యాప్తి చెందడానికి ప్రభుత్వంతో పాటు, అక్కడి పౌరుల నిర్లక్ష్యమూ కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, పౌరుల నిర్లక్ష్య వైఖరికి ఎంతటి మూల్యం చెల్లించుకోవాల్సివస్తుందోనన్న విషయంలో ప్రపంచ దేశాలకు ఇటలీ పాఠంగా నిలుస్తోంది.

Tags: corona in italy, virus, italy, death toll, corona effect, corona outbreak

Next Story

Most Viewed