బావిలో వ్యక్తి మృతదేహం.. పడేశారా.. పడిపోయాడా?

by  |
KMMA-DEADBODY
X

దిశ, పాలేరు: నేలకొండపల్లి మండలం చెర్వమాదారం సమీపంలోని వ్యవసాయ బావిలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది. మృతుడు నేలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన రాయల సుధీర్ (45)గా గుర్తించారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీసి పోస్ట్ మార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతుడు ఆత్మహత్య చేసుకున్నాడా.. లేక ఏమైన కారణాలు ఉన్నాయా అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.


Next Story

Most Viewed