గోదావరిఖనిలో కిరాతక హత్య.. బాడీని ముక్కలు ముక్కలుగా చేసి తల, మొండాన్ని..!

by  |
గోదావరిఖనిలో కిరాతక హత్య.. బాడీని ముక్కలు ముక్కలుగా చేసి తల, మొండాన్ని..!
X

దిశ, గోదావరిఖని : పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తిని కిరాతకంగా హత్య చేసి శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా చేసి ఒక్కో భాగాన్ని ఒక్కోచోట పడేసిన ఘటన కోల్ బెల్ట్ ప్రాంతంలో సంచలనంగా మారింది. ఈ ఘటన జిల్లాలోని రామగుండం మండలం గోదావరిఖనిలో శనివారం ఆలస్యంగా వెలుగుచూసింది. మృతుడికి సంబంధించి ఇప్పటికే రెండు చేతులు, తల దొరకగా.. సాయంకాలం బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మేడిపల్లిలో మొండెం లభ్యమైంది.

వివరాల్లోకి వెళ్లితే.. రెండు రోజుల కిందట ఖాజిపల్లికి చెందిన కాంపెల్లి శంకర్(35) అదృశ్యం అయ్యాడు. ముక్కలుగా లభ్యమైన డెడ్ బాడీ అతనిదే అని బంధువులు అనుమానిస్తున్నారు. ఈ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తన కుమారుడి హత్యకు నా కోడలి తరఫు బంధువులే కారణమని మృతుడి తల్లి ఆరోపించింది. నిందితులను కఠినంగా శిక్షించాలని ఎఫ్‌సీఐ క్రాస్ రోడ్ రాజీవ్ రహదారిపై బాధిత కుటుంబ సభ్యులు ధర్నా నిర్వహించారు. ఘటనా స్థలాన్ని రామగుండం సీపీ చంద్రశేఖర్ రెడ్డి పరిశీలించారు. రామగుండం సీఐ లక్ష్మీనారాయణ రెండు రోజుల్లో నిందితులను పట్టుకుంటామని మీడియాకు వెల్లడించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.



Next Story

Most Viewed