కలెక్టర్లు రాత్రింబవళ్లు కలెక్టరేట్‌లోనే..?

by  |
కలెక్టర్లు రాత్రింబవళ్లు కలెక్టరేట్‌లోనే..?
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి : ఉద్యోగుల విభజనలో జిల్లా కలెక్టర్‌తో పాటు సంబంధిత శాఖల అధికారులు నిమగ్నమయ్యారు. అన్ని జిల్లాలు వేరైతే.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిస్థితి మరో రకంగా ఉంటుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి వికారాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలు కొత్తగా ఏర్పడ్డాయి. రంగారెడ్డి జిల్లాలో మహబూబ్ నగర్ జిల్లాలోని కొన్ని మండలాలు విలీనం అయ్యాయి.

దాంతో పాటు వికారాబాద్ జిల్లాలో కూడా మహబూబ్ నగర్‌లోని కొన్ని మండలాలు విలీనం కావడంతో ఉద్యోగుల విభజన అధికారులకు కత్తిమీద సాములా మారింది. అంతేకాకుండా విభజన విషయంలో ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా పారదర్శకంగా జిల్లాలకు కేటాయింపు జరిగేలా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ కృషి చేస్తున్నారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా మూడు జిల్లాలకు సంబంధించిన 58 శాఖల అధికారులు, కలెక్టర్లు ఉద్యోగుల విభజనలో తలమునకలయ్యారు.


Next Story