ఈ గాయం మానేదెలా?

by  |
ఈ గాయం మానేదెలా?
X

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బౌలర్లకు కలసి రానట్లుంది. సీజన్ తొలి మ్యాచ్‌లోనే మిచెల్ మార్ష్ బౌలింగ్ చేస్తూ గాయపడి ఐపీఎల్‌కే దూరమయ్యాడు. ఇక శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కీలకమైన 19వ ఓవర్ వేస్తూ తొల బంతి తర్వాత భువనేవ్వర్ గాయంతో విలవిల్లాడాడు. అప్పటికీ ఫిజియోతో గాయానికి ఉపశమనం ఇచ్చే స్ప్రేలు వాడినా మూడు సార్లు బౌలింగ్ వేయడానికి పరుగు తీసి వేయలేక పోయాడు. దీంతో అతడు తొలి బంతి తర్వాత మైదానాన్ని వీడాడు.

కాగా, గత కొంత కాలంగా తొడకండరాల గాయం కారణంగానే భువీ టీమ్ ఇండియాకు కూడా దూరమయ్యాడు. ఇప్పుడు ఐపీఎల్‌లో కూడా అదే గాయం తిరగబెట్టినట్లు తెలుస్తున్నది. దీంతో అతడు ముంబయి జట్టుతో జరిగే తర్వాతి మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడో లేదో అనేది యాజమాన్యం తేల్చి చెప్పలేకపోతున్నది. భువనేశ్వర్‌ కుమార్‌ గాయంపై ఇంకా స్పష్టత రాలేదని సన్‌రైజర్స్‌ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్‌ వార్నర్‌ అన్నాడు.

Next Story

Most Viewed