- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ,వెబ్డెస్క్: తల్లి ఈ ప్రేమా దోమా మనకొద్దు. నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకుంటే మన కుటుంబ పరువుపోతుంది. నేను బయట తలెత్తుకొని తిరగలేనంటూ తండ్రి కూతురికి నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. దీంతో ఆగ్రహించిన కూతురు, ఇతర కుటుంబ సభ్యులు తండ్రిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ దారుణంలో తండ్రి మరణించగా.., నిందితులు పరారయ్యారు.
ఉత్తర్ ప్రదేశ్ లోని బోదాన్ జిల్లాకు చెందిన వాజిర్ గంజ్ హత్రా గ్రామంలో అమిర్ అనే వ్యక్తికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. అందులో పెద్ద కూతురు ఓ యువకుడితో ప్రేమాయణం నడిపిస్తుంది. ఇదే విషయంపై తండ్రికి, కూతురికి మధ్య గత కొద్ది రోజులుగా వాగ్వాదం జరుగుతుంది. అయితే ఎప్పటిలాగే ప్రేమ వ్యవహారంపై తండ్రీ -కూతురి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. తండ్రి తన ప్రేమ వివాహాన్ని అంగీకరించడం లేదనే కోపంతో నిందితురాలు, ఇతర కుటుంబ సభ్యులు కలిసి బాధితుడు అమిర్ పై పెట్రోల్ తో దాడి చేశారు ఈ దాడిలో బాధితుడు 30శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ మరణించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.