పరిస్థితులు ఆందోళనకరం.. తగ్గినట్టే తగ్గి పెరుగుతున్న కేసులు : లవ్ అగర్వాల్

by  |
పరిస్థితులు ఆందోళనకరం.. తగ్గినట్టే తగ్గి పెరుగుతున్న కేసులు : లవ్ అగర్వాల్
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతూ ఉండటంపై కేంద్ర వైద్యారోగ్య శాఖ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్ స్పందించారు. దేశంలో కరోనా కేసులు తగ్గినట్లే తగ్గి పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. నిన్నటితో పోలిస్తే బుధవారం కేసుల తీవ్రత మరింత పెరిగిందన్నారు. 12 రాష్ట్రాల్లో లక్ష కంటే ఎక్కువ పరిస్థితులు నమోదవుతున్నట్లు పేర్కొన్నారు. పాటిటివిటీ, మరణాల రేటు పెరగడం ఆందోళనకరమని తెలిపారు.

బెంగళూరు, చెన్నై, గురుగ్రామ్‌లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని వివరించారు. 13 రాష్ట్రాల్లో రోజుకు వంద మందికి పైగా మరణాలు సంభవిస్తున్నాయని చెప్పారు. బెంగళూరులో పాటిజివిటీ రేటు 50 శాతం ఉందన్నారు. కాగా, ప్రస్తుతం దేశంలో ఒక్కరోజులోనే నాలుగు లక్షల వరకు కేసులు నమోదవుతుండటం విశేషం.

Next Story

Most Viewed