- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో గతవారం చోటుచేసుకున్న అల్లర్లపై దర్యాప్తు చేయడానికి సిట్ను ఏర్పాటు చేసినట్టు సీఎం యెడియూరప్ప వెల్లడించారు. అవసరమైతే గూండా చట్టాన్ని ప్రయోగించడాన్ని సిట్ పరిశీలిస్తుందని తెలిపారు. అల్లర్లకు కారకులైన వారిపై కఠిన చర్యలుంటాయని, అవసరమైతే వారిపై ఉపా చట్టాన్ని ప్రయోగించే అవకాశముందని వివరించారు.
కాగా, ధ్వంసమైన ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను అందుకు కారకులైన దోషుల నుంచే వసూలు చేస్తామని తెలిపారు. నష్టాన్ని ప్రభుత్వం అంచనా వేస్తుందని అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు క్లెయిమ్ కమిషనర్ ఏర్పాటుకు హైకోర్టును ఆశ్రయిస్తామని వివరించారు.
Next Story