- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, హుజురాబాద్ రూరల్ : ఎన్నికల షెడ్యూల్ రావడం ఏమో కానీ దళిత బంధు లబ్దిదారులకు ఇబ్బందులు మాత్రం తప్పడం లేదు. ప్రభుత్వం కేటాయించిన రూ.10 లక్షల సాయం కోసం ఆఫీసుల చుట్టూ తిరుగక తప్పని పరిస్థితి ఎదురైంది వారికి. ఇంటికి వచ్చి సర్వే చేసిన అధికారులు తమకు యూనిట్ అప్పగించే వరకూ అదే పద్దతిన వ్యవహరిస్తారనుకున్నప్పటికీ చివరి క్షణంలో ఆఫీసుల చుట్టూ ప్రదక్షణలు చేయకతప్పని పరిస్థితి తయారైంది.
వాహనాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కొటేషన్లు ఇచ్చేందుకు టాటా కంపెనీ ప్రతినిధులను ప్రత్యేకంగా పిలిపించారు అధికారులు. లబ్దిదారులు తమ వాహనాలకు సంబంధించిన కొటేషన్లు తీసుకునేందుకు సంబంధిత కార్యాలయాలకు రావాలని కోరారు. హుజురాబాద్ పట్టణ పరిధిలోని లబ్దిదారులకు మునిసిపల్ ఆఫీసులో, మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వారికి ఎంపీడీఓ కార్యాలయంలో కొటేషన్లు ఇచ్చేందుకు పలు ఏర్పాట్లు చేశారు. దీంతో పెద్ద సంఖ్యలో వచ్చిన లబ్దిదారులు ఆయా కార్యాలయల వద్దకు చేరుకున్నారు. ఉదయం నుండి ఈ రెండు ఆఫీసుల ముందు దళితులు పెద్ద ఎత్తున చేరుకుని కొటేషన్లు తీసుకుంటున్నారు.