కొనసాగుతున్న దళిత బంధు సర్వే- పాల్గొన్న జాయింట్ కలెక్టర్

by  |
dalitha-band
X

దిశ, కమలాపూర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు సర్వే కార్యక్రమం మండలంలో కొనసాగుతొంది. శనివారం గూడూరు గ్రామంలో హనుమకొండ జిల్లా జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి సంబంధిత అధికారులతో పాటు పర్యటించారు. దళిత బంధు సర్వేలో భాగంగా జాయింట్ కలెక్టర్ గ్రామాల్లోని లబ్ధిదారుల ఇంటి వద్దకు నేరుగా వెళ్లి దళిత బంధువు ద్వారా వచ్చిన 10 లక్షల రూపాయలతో ఎటువంటి వ్యాపారాలు చేయబోతున్నారని అడిగి తెలుసుకున్నారు. అనంతరం లబ్ధిదారులతో మాట్లాడుతూ, ఎటువంటి వ్యాపారాలు చేయాలో అవగాహన కల్పిస్తామని, సలహాలు సూచనల కోసం సంబంధిత అధికారులను సంప్రదించవలసినదిగా కోరారు .

Next Story